Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరి... కర్ణాటకలో రాజకీయ సంక్షోభం

కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు తాత్కాలికంగా బ్రేక్‌పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీం ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక బుధవారం రోజంతా భారీ కసరత్తు జరిపింది. ముఖ్యమంత్రి స

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (10:52 IST)
కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు తాత్కాలికంగా బ్రేక్‌పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీం ఆదేశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటక బుధవారం రోజంతా భారీ కసరత్తు జరిపింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉదయం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఆపై మాజీ ప్రధాని దేవేగౌడతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. అనంతరం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మాజీ ప్రధాని దేవేగౌడ స్వయంగా సమావేశానికి హాజరై పలు సూచనలు చేశారు. వీరంతా కలిసి తమిళనాడుకు చుక్కనీరు కూడా వదలవద్దని హితవు పలికారు. 
 
పైగా, శాసనసభను తక్షణం సమావేశపరచాలని సూచించారు. ఆ తర్వాత బుధవారం సీఎం అధ్యక్షతన కేబినెట్‌ అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో అఖిలపక్ష భేటీలో తీసుకున్న అన్ని కీలక నిర్ణయాలకూ ఆమోదముద్ర వేశారు. 24న అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరచనున్నారు. అంతవరకు తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయకూడదని మంత్రిమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే శనివారం జరగనున్న అసెంబ్లీ అత్యవసర సమావేశంలోనూ చర్చ జరిపి తమిళనాడుకు కావేరీ నీటి విడుదల సాధ్యం కాదంటూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించనున్నారు.
 
తర్వాత ముఖ్యమంత్రి సిద్దరామయ్య నాయకత్వంలో రాష్ట్ర నేతలంతా కలసికట్టుగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వద్దకు వెళ్లి ఈ సంక్షోభంపై వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరనున్నారు. రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మాత్రం అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments