ఓటు వేస్తే పిల్లలకు ఎక్స్‌ట్రా మార్కులు... ఎక్కడ?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (17:30 IST)
ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లకు.. ఓటు వేయడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పిస్తోంది. వేసవి సెలవులు రావడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి పర్యటనలకు ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ వేసవిలో ఎన్నికలు ఉండటంతో ప్రజలు ఓటు వేయడం కంటే పర్యటనకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే అవకాశం ఉంది.


అయితే ఓటు వేయడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించేందుకు కర్ణాటకలో ప్రైవేట్ స్కూళ్లు ఓ నిర్ణయానికి వచ్చాయి. ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకునే ఉద్దేశంతో ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నాయి.
 
ఎన్నికల్లో తల్లిదండ్రులు ఓటు వేస్తే, పిల్లలకు అదనపు మార్కులు వేస్తామంటూ ఆఫర్ చేస్తున్నాయి. ఈ రకంగా విద్యార్థుల తల్లిదండ్రులను ఓటు వేసేలా ప్రొత్సాహిస్తున్నారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులను ఓటు వేసేలా చూడాలి. ఒక్కో పేరంట్ ఓటుకు ఒక్కో అదనపు మార్కు వేస్తారు.

ఇప్పటికే దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు SMSలు పంపిస్తున్నారు. ఓటు వేసాక తల్లిదండ్రులు తప్పనిసరిగా పాఠశాలకు వచ్చి వేలిపై సిరాను చూపించాల్సిందిగా సూచిస్తున్నారు.

ఒకవేళ ఆరోజు కుదరకుంటే పక్కరోజు వచ్చి అయినా వేలిపై సిరా గుర్తును చూపించాలని కోరుతున్నారు. అప్పుడే విద్యార్థులకు అదనపు మార్కులు వేస్తామని కండీషన్ పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments