Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీలో 182 మందికి కరోనా: ఫ్రెషర్స్ పార్టీనే కొంపముంచింది..

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (16:10 IST)
కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా పాఠశాలల్లో, కళాశాలల్లో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. వివరాల్లోకి వెళితే ధార్వాడలోని ఓ మెడికల్ కాలేజీలో 182 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 
 
ఓ విద్యార్థి చేసిన ఫ్రెషర్స్ పార్టీ కోవిడ్ వ్యాప్తికి కారణం అయ్యింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారందరికీ కూడా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ముందుగా 66 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 182కు చేరింది. 
 
క్యాంపస్‌లో ఇటీవల నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీలో విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీంతో ఈ పార్టీ కాస్త వైరస్ వ్యాప్తికి దారితీసిందని అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారందర్నీ క్వారంటైన్ కు తరలించామన్నారు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు. హాస్టల్స్ కూడా మూసివేశామన్నారు. 
 
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిని సైతం ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. కొందరిలో తేలిక పాటి కరోనా లక్షణాలు ఉంటే.. మరికొందరిలో మాత్రం అసలు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. 
 
అందర్నీ క్యాంపస్ లోపలే ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. అటు ఒడిశా వైద్య కళాశాలలో కూడా 54 మందికి పాజిటివ్‌ రావడంతో నాలుగు హాస్టళ్లను మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. పది రోజులపాటు ప్రత్యక్ష తరగతులను సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments