Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానించే వ్యక్తి మృతి చెందడంతో సూసైడ్ చేసుకున్న వివాహిత

Webdunia
బుధవారం, 15 మే 2019 (09:32 IST)
మహిళలకు సెంటిమెంట్ ఎక్కువ. చిన్నపాటి విషయాలకే వారు సెంటిమెంట్‌కు గురవుతుంటారు. తాజాగా తనను అభిమానించే వ్యక్తి ఒకరు చనిపోవడాన్ని తట్టుకోలేని ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్ణాటక రాష్ట్రంలోని మజరాహోసహళ్లి గ్రామానికి చెందిన పుట్టరాజు అనే వ్యక్తి భార్య పుష్పలత. ఈమెను అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అమితంగా అభిమానించేవాడు. అయితే, ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పుష్పలత ఆహారపానీయాలు ముట్టుకోకుండా దిగాలుగా ఇంట్లోనే కూర్చొండిపోయింది. 
 
ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పుష్పలత ఉరివేసుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండగా, భర్త పుట్టరాజు స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కన్నడ భాషా సంఘాల ఆధ్వర్యాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించే పుష్పలత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments