Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా టీచర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు.. ఎక్కడ.. ఎందుకు?

తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఓ మహిళా టీచర్ విద్యార్థుల కళ్ళ ఎదుటే మంటల్లో కాలిపోయింది. దీనికి కారణం.. ఓ వ్యక్తి తరగతి గదిలోనే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బెంగళూరు మహానగర శివారు

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (09:03 IST)
తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఓ మహిళా టీచర్ విద్యార్థుల కళ్ళ ఎదుటే మంటల్లో కాలిపోయింది. దీనికి కారణం.. ఓ వ్యక్తి తరగతి గదిలోనే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బెంగళూరు మహానగర శివారు మాగడి ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కర్ణాటకలో పెను కలకలం రేపుతోంది. 
 
దీనిపై బ్యాదరహల్లి పోలీసులు వెల్లడించిన వివరాలన మేరకు.. సునంద (50) అనే మహిళా ఉపాధ్యాయురాలు బుధవారం మధ్యాహ్నం తరగతి గదిలోని విద్యార్థులకు పాఠం చెబుతుండగా రేణుకారాధ్య అనే వ్యక్తి తరగతి గదిలోకి చొరబడి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బంది వేగంగా స్పందించి, మంటలు ఆర్పేసి, హుటాహుటీన ఆసుపత్రిలో చేర్చారు. 
 
ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్న సుకందకట్టె ప్రభుత్వాసుపత్రి వైద్యులు మాట్లాడుతూ... ఆమెకు 50 శాతం గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నామని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments