రెండో తరగతి చిన్నారికి బలవంతంగా కోడిగుడ్డు తినిపించిన టీచర్.. తర్వాత ఏమైంది?

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (09:05 IST)
కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గలో ఓ ఘటన జరిగింది. ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న శాఖాహార సామాజిక వర్గానికి చెందిన ఆరేళ్ల బాలికకు ఆ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు బలవంతంగా కోడిగుడ్డు తినిపించాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాఠశాలలో వడ్డించే మధ్యాహ్న భోజన పథకం కింద కోడిగుడ్డును తన కుమార్తెకు టీచరీ బలవంతంగా తినిపించాడని, దీంతో తన కుమార్తె తీవ్ర అస్వస్థతకు లోనైందని విద్యాశాఖ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాము శాఖాహారులమని పాఠశాల యాజమాన్యానికి చెప్పినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయాడు. 
 
పైగా, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కొడతామంటూ తన కుమార్తెను బెదిరించారని, తమ సామాజిక వర్గానికి చెందిన వారు గుడ్డు తింటే ఏమీ కాదని చెప్పినా టీచర్ హేళనగా మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అందువల్ల ఈ ఘటనకు బాధ్యులైన ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ హెడ్మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, బాలిక తండ్రి చేసిన ఆరోపణలను స్కూల్ యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు కూడా కొట్టిపారేశారు. ఇదిలావుంటే, ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments