Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక సీఎంకు ఓ వ్యక్తి లేఖ.. లో దుస్తులు కొనుక్కోవాలి.. షాపులు తెరవండి..

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (16:28 IST)
కర్ణాటక సీఎంకు ఓ వ్యక్తి లేఖ రాశాడు. ఈ లేఖ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో ముందుగా మే 10 నుంచి 24వ తేదీ వరకు రెండు వారాలు లాక్ డౌన్ ప్రకటించినా కేసుల ఉద్ధృతితో దానిని పొడిగించారు. దీంతో ప్రస్తుతం జూన్ 7 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. 
 
జూన్ 7 తర్వాత కూడా కర్ణాటకలో మరోసారి లాక్ డౌన్ పొడిగించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో ఓ వ్యక్తి సీఎం యెడియూరప్పకు ఓ లేఖ రాశాడు. ఆ లేఖ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. తన లోదుస్తులు పూర్తిగా పాడయ్యాయని.. వాటిని కొనుక్కునేందుకు షాపులు తెరిపించాలని ఆ లేఖలో రాశాడు. చామరాజపురానికి చెందిన నరసింహమూర్తి ఈ లేఖలో తన బాధను రాసుకొచ్చాడు.
 
మీకు నా వినతి కాస్త వింతగా అనిపించొచ్చు. కానీ నాకున్న జత బనియన్లు, అండర్ వేర్లు పూర్తిగా చిల్లులు పడ్డాయి. గత రెండు వారాల నుండి కొత్తవి కొనుక్కోవాలని అనుకున్నా లాక్ డౌన్ నేపథ్యంలో షాపులు తెరవడం లేదు. 
 
ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ కొనసాగిస్తారని ప్రచారం జరుగుతుంది. అలా కొనసాగించే పక్షంలో వారానికి ఒకసారైనా షాపులు కొద్ది గంటలపాటు తీసినా నాలాంటి వారికి ఇన్ని ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఈ లేఖలో పేర్కొన్నాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments