Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమాన భూతం... గొంతుపై కాలుతో తొక్కి భార్యను చంపేశాడు..

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (07:26 IST)
కట్టుకున్న భార్య అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానం పెనుభూతమైంది. ఇదే విషయంపై భార్యతో పలుమార్లు భర్త గొడవ పెట్టుకున్నాడు. నేను అలాంటిదాన్ని కాదు అంటూ మొత్తుకున్నప్పటికీ.. భర్తకు పట్టిన అనుమాన భూతం మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో భార్య గొంతుపై కాలుతో తొక్కి చంపేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా హుణసూరు కల్కుణికె హోసింగ్‌ బోర్డు కాలనీలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ కాలనీకి చెందిన సౌమ్య(30), రవి అనే దంపతులు ఉన్నారు. వీరికి 11 యేళ్ళ క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో భార్య ప్రవర్తనపై భర్తకు అనుమానం పెరిగింది. దీంతో ఆమెతో అనేకసార్లు గొడవ పడ్డాడు. ఒకటిరెండుసార్లు పోలీసుల వద్దకు వెళ్లగా రాజీ చేసి పంపారు.
 
కానీ రవిలో అనుమాన భూతం పోలేదు. ఆదివారం నిద్రపోయిన సమయంలో భార్య గొంతుపైన రవి కాలుతో తొక్కి హత్య చేశాడు. ఆమె ఇంకా చనిపోలేదేమో అనే అనుమానంతో చున్నీని గొంతుకు బిగించి ఉరివేశాడు. తర్వాత ఇంటి నుంచి పరారైనాడు. 
 
సోమవారం ఉదయం ఎంతకు తలుపులు తీకపోవడంతో ఇరుగుపొరుగు వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుణసురు పొలీసులు పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. రంగనాథ లేఔట్‌లో దాక్కున్న కిరాతక భర్తను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments