హిజాబ్ వివాదంపై కమల్ హాసన్ ఏమన్నారో తెలుసా?

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (12:45 IST)
క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కొన్ని క‌ళాశాలల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధ‌రించి త‌ర‌గ‌తుల‌కు హాజ‌రుకావ‌డంపై జ‌నవ‌రి చివ‌రి వారంలో ప్రారంభ‌మైన వివాదం చినికి చినికి గాలి వాన‌లా మారింది. మంగ‌ళ‌వారం ఉడుపి, మాండ్య త‌దిత‌ర జిల్లాల్లో విద్యార్థి వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు నెల‌కొన్నాయి. 
 
ఈ నేప‌థ్యంలో స్పందించిన రాష్ట్ర ప్ర‌భుత్వం స్కూల్స్‌, కాలేజీల‌కు మూడు రోజులు సెలవులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  
 
కాగా.. ఈ వివాదంపై సినీ న‌టుడు, మ‌క్క‌ల్ నీది మ‌య్యం (ఎంఎన్ఎం) అధ్య‌క్షుడు క‌మ‌లహాస‌న్ స్పందించారు. ఈ వివాదం విద్యార్థుల మ‌ధ్య మ‌త విద్వేషంగా మారుతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం స‌హా అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరుకుంటున్నా అని క‌మ‌ల్ హాస‌న్ ట్వీట్ చేశారు. 
 
ఈ వివాదం అమాయ‌క విద్యార్థుల మ‌ధ్య మతపరమైన విభజనను సృష్టిస్తున్నాయని కమల్ హాసన్  పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతోన్న ఇటువంటి ప‌రిణామాలు త‌మిళ‌నాడు వ‌ర‌కు పాకకుండా చూసుకోవాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments