8వ తరగతి చదివిన ఎమ్మెల్యేకు ఉన్నత విద్యాశాఖ...

ఎనిమిదో తరగతి చదవిన నేతకు ఉన్నత విద్యాశాఖను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కట్టబెట్టారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీనిపై సీఎం కుమార స్వామి స్పందించారు.

Webdunia
ఆదివారం, 10 జూన్ 2018 (12:11 IST)
ఎనిమిదో తరగతి చదవిన నేతకు ఉన్నత విద్యాశాఖను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కట్టబెట్టారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీనిపై సీఎం కుమార స్వామి స్పందించారు. కేవలం ఎనిమిదో తరగతి చదివిన వ్యక్తికి ఉన్నత విద్యాశాఖను అప్పగించడంలో తప్పేమీ లేదన్నారు. బీఎస్సీ చదివిన తాను సీఎంగా పని చేస్తున్నానని గుర్తుచేశారు.
 
ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాముండేశ్వరి స్థానం నుంచి మాజీ సీఎం సిద్ధరామయ్యను ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరొంచిన జేడీఎస్ నేత జీటీ దేవెగౌడను కుమారస్వామి తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి శాఖల కేటాయింపుల్లో భాగంగా జీటీ దేవెగౌడకు ఉన్నత విద్యాశాఖను అప్పగించారు.
 
దీనిపై కలత చెందిన జీటీ దేవెగౌడ.. తాను మంత్రిగా పని చేయడానికి ఉన్నత విద్యాశాఖ కంటే చిన్న తరహా నీటిపారుదల శాఖ మెరుగైందన్నారు. ఆయన వ్యాఖ్యలను సీఎం కుమారస్వామి కొట్టి వేశారు. శాఖల కేటాయింపుల మీద అసమ్మతిపై సీఎం స్పందిస్తూ కొందరు వ్యక్తులు కొన్ని శాఖల్లోనే పని చేయాలని కోరుకుంటారు. కానీ ప్రతి శాఖలోనూ సమర్థవంతంగా పని చేసేందుకు అవకాశం ఉన్నది అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లోని చికిరి చికిరి సాంగ్ ..రహ్మాన్‌ పై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది : రామ్ చరణ్

Katrina Kaif : మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. అభినందనల వెల్లువ

The Girlfriend Review : రష్మిక మందన్నా నటించిన ది గాళ్ ఫ్రెండ్ రివ్యూ

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments