Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భవిష్యత్తులోనూ ధరల మంటే... సర్వేలో తేటతెల్లం

సుపరిపాలన అందిస్తానంటూ విస్తృతంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పాలనా పగ్గాలు చేపట్టి నాలుగేళ్ళ పూర్తయింది. మరి, ఈ నాలుగేళ్లలో దేశంలో ధరలు మాత్రం గత పాలన కంటే అధికంగా ఉండ

భవిష్యత్తులోనూ ధరల మంటే... సర్వేలో తేటతెల్లం
, ఆదివారం, 10 జూన్ 2018 (10:46 IST)
సుపరిపాలన అందిస్తానంటూ విస్తృతంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పాలనా పగ్గాలు చేపట్టి నాలుగేళ్ళ పూర్తయింది. మరి, ఈ నాలుగేళ్లలో దేశంలో ధరలు మాత్రం గత పాలన కంటే అధికంగా ఉండటం గమనార్హం. అయితే, ద్రవ్యోల్బణం గతంతో పోలిస్తే మెరుగుపడింది. కానీ, ధరల పరిస్థితి మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేదు.
 
రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం పెరగనుందని, దానితోపాటే ధరల మంట తప్పదని అత్యధికులు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం దిగజారిందని 2014 సర్వేలో 1.8 శాతం మంది అభిప్రాయపడితే... ఈసారి వారి సంఖ్య 7.3 శాతం. 
 
భవిష్యత్తులో ఇంకా దారుణంగా ఉంటుందని అప్పట్లో 1.5 శాతం ఆందోళన వ్యక్తంచేస్తే.. ఇప్పుడు 5.5 శాతానికి పెరిగింది. ధరల పరిస్థితి మెరుగుపడిందని నాలుగేళ్ల కిందట 87.1 శాతం చెబితే... తాజా సర్వేలో వారి సంఖ్య 79.2 శాతం మాత్రమే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీపై తీవ్ర వ్యతిరేకత... నేతల్లో గుబులు