Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం తర్వాత అలసిపోయి నిద్రపోయా : బాధితురాలి వాంగ్మూలం!

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (15:44 IST)
తనపై అత్యాచారం జరిగిన తర్వాత బాగా అలసిపోవడం వల్ల నిద్రపోయానని, అందువల్ల తనకు ఏం జరిగిందో గుర్తులేదని ఓ అత్యాచార కేసులోని బాధితురాలు కోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పైగా, ఈ కేసులో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితుడికి ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. 
 
కర్నాటకలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తాను తన కార్యాలయ సిబ్బంది చేతిలో అత్యాచారానికి గురైనట్టు ఓ యువతి కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. 
 
ఈ కేసు విచారణ సందర్భంగా కేసు పెట్టిని యువతిపై హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'తనపై అత్యాచారం జరిగిన తర్వాత అలసిపోయానని బాధితురాలు చెప్పింది. ఇది చాలా దారుణం. భారతీయ మహిళ స్వభావం ఇది కాదు. 
 
రాత్రి 11 గంటలకు ఆఫీసుకు వెళ్లడం, నిందితుడితో కలిసి మందు తాగడం, రాత్రంతా అక్కడే గడపడం వంటి చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఆమె చెపుతున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవు' అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదేసమయంలో నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments