Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం తర్వాత అలసిపోయి నిద్రపోయా : బాధితురాలి వాంగ్మూలం!

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (15:44 IST)
తనపై అత్యాచారం జరిగిన తర్వాత బాగా అలసిపోవడం వల్ల నిద్రపోయానని, అందువల్ల తనకు ఏం జరిగిందో గుర్తులేదని ఓ అత్యాచార కేసులోని బాధితురాలు కోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పైగా, ఈ కేసులో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితుడికి ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. 
 
కర్నాటకలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తాను తన కార్యాలయ సిబ్బంది చేతిలో అత్యాచారానికి గురైనట్టు ఓ యువతి కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. 
 
ఈ కేసు విచారణ సందర్భంగా కేసు పెట్టిని యువతిపై హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'తనపై అత్యాచారం జరిగిన తర్వాత అలసిపోయానని బాధితురాలు చెప్పింది. ఇది చాలా దారుణం. భారతీయ మహిళ స్వభావం ఇది కాదు. 
 
రాత్రి 11 గంటలకు ఆఫీసుకు వెళ్లడం, నిందితుడితో కలిసి మందు తాగడం, రాత్రంతా అక్కడే గడపడం వంటి చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఆమె చెపుతున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవు' అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అదేసమయంలో నిందితుడికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments