రాజీనామాలపై మీరే నిర్ణయం తీసుకోండి... సుప్రీంకోర్టు

Webdunia
బుధవారం, 17 జులై 2019 (13:15 IST)
కర్నాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌దేనని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పైగా, గురువారం జరగబోయే బలపరీక్షకు వెళ్లడం.. వెళ్లకపోవడం అనేది ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయమని తెలిపింది.
 
మరోవైపు ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రభుత్వం గురువారం విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. దీంతో విశ్వాస పరీక్షకు ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అన్నది ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది. సభలో ప్రతిపాదించనున్న అవిశ్వాస తీర్మానంపై ఎంత మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 
ఇప్పటికే 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని తమ పిటిషన్‌లలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీరి రాజీనామాలను ఆమోదించాలా.. లేక వీరి అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై విచక్షణాధికారం స్పీకర్‌కే ఉంటుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తేల్చిచెప్పింది.
 
మరోవైపు, తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదనీ, విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి కుమార స్వామి స్పష్టంచేశారు. పైగా, సభలో మెజార్టీని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. అయితే, రెబెల్ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావాలా.. వద్దా అన్న విషయమై నిర్ణయాధికారాన్ని కోర్టు వారికే వదిలేయడంతో.. కుమారస్వామి ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇపుడు స్పీకర్ తీసుకునే నిర్ణయంపై ఆయన ప్రభుత్వం ఆధారపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments