Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు గొలుసు మింగిన ఆవు - పొట్టకు ఆపరేషన్ చేసి తీశారు...

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (09:49 IST)
ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని సిర్పి తాలూకా హీపనళ్ళిలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ గ్రామంలో ఒక రైతుకు చెందిన ఓ ఆవు బంగారు చైన్ మింగేసింది. దీన్ని వెలికి తీసేందుకు ఆవుకు ఆపరేషన్ చేశారు. ఈ సంఘటన దీపావళి సమయంలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ గ్రామానికి చెందిన శ్రీకాంత్ హెగ్డే అనే వ్యక్తి ఆ రైతు. తన కుటుంబ సభ్యులతో కలిసి గత దీపావళి పండుగను పురస్కరించుకుని గోపూజను నిర్వహించారు. ఇందుకోసం ఆవు, లేగదూడను అందంగా ముస్తాబు చేశారు. పూలదండలతో పాటు బంగారు గొలుసు కూడా వేశారు. అయితే, ఈ పూజ పూర్తయిన తర్వాత బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో ఆవు లేదా లేగదూడ మింగేసివుంటుందని భావించారు. 
 
అప్పటి నుంచి ప్రతి రోజూ ఉదయం పేడను పరిశీలిస్తూ వచ్చారు. ఎంతకీ గొలుసు కనిపించకపోవడంతో ఓ రోజున పశువైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఆవు పొట్టలో గొలుసు ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆవు పొట్టకు స్కానింగ్ చేసిన గొలుసు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. పిమ్మట కుటుంబ సభ్యుల వినతి మేరకు ఆవుకు ఆపరేషన్ నిర్వహించి, బంగారు గొలుసును వెలికి తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments