బీజేపీకి టాటా చెప్పేసిన గాలి జనార్థన్ రెడ్డి.. కొత్త పార్టీ దిశగా అడుగులు

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2022 (16:25 IST)
కర్నాటక మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి టాటా చెప్పేశారు. గత కొంతకాలంగా ఆ పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ వచ్చిన ఆయన చివరకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలో ఉన్న బీజేపీకి ఆయన రాజీనామా చేయడం ఇపుడు కర్నాటక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పైగా కొత్త పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించారు. 
 
కొంతకాలంగా బీజేపీపై అసంతృప్తితో ఉన్న గాలి జనార్థన్ రెడ్డి... ఆదివారం తన నివాసం పారిజాతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ఆయన కళ్యాణ్ రాజ్య ప్రగతి పక్ష అనే పేరుతో కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఇకపై సొంత పార్టీతో రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని తెలిపారు. బీజేపీతో తన బంధం ముగిసిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు చేరుకునేలా పార్టీని నిర్మిస్తానని, కర్నాటక ప్రజల హృదయాలను గెలుచుకుంటానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments