12 నిమిషాల్లో చార్జింగ్ పూర్తయ్యే ఇన్ఫినిక్స్ మొబైల్స్ విక్రయాలు ప్రారంభం

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2022 (15:23 IST)
దేశంలో మరో కొత్త రకం మొబైల్ ఫోన్ అమ్మకానికి వచ్చింది. ఇది కేవలం 12 నిమిషాల్లోనే చార్జింగ్ పూర్తవుతుంది. ఇన్ఫినిక్స్ జీరో అల్ట్రా పేరుతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ కలిగిన ఈ ఫోన్ ధర రూ.29,999గా నిర్ణయించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు కార్డులపై రూ.3 వేల వరకు తగ్గింపు లభించనుంది. ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్‌లో అందుబాటులో ఉంచింది. 
 
6.8 అంగుళాల ఫుల్‌ హెచ్.డి, 3డీ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్ ప్లే సహా ఎన్నో ప్రత్యేకతలు ఈ ఫోన్లు కలిగివున్నాయి. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, మీడియా టెక్ డైమెన్సిటీ 920 5జీ చిప్ సెట్‌తో తయారు చేశారు. 12జీబీ ర్యాబ్ 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో తీసుకొచ్చారు. 
 
ఈ ఫోన్ వెనుక 200 మెగాపిక్సల్ కెమరాను అమర్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోనులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 180 వాట్ ఫాస్ట చార్జ్‌తో కేవలం 12 నిమిషాల్లోనే పూర్తి చార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫోను ధర రూ.29999గా ఉండగా, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుపై రూ.2 వేలు, ఫెడర్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ.3 వేలు చొప్పున తగ్గింపు పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్‌ను దొర అంటూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు - కర్రుకాల్చి వాత పెట్టిన నటి హేమ (Video)

మెగాస్టార్ చిరంజీవి సినిమాకు నో చెప్పిన హనీరోజ్.. ఎందుకంటే?

Amir Khan: గౌరీతో మూడో పెళ్లికి సిద్ధమవుతున్న అమీర్ ఖాన్?

హీరోతో ముద్దు సన్నివేశం.. భర్తను తోడుతెచ్చుకున్న హీరోయిన్.. ఎవరు? (video)

"పెద్ది"తో మళ్లీ ట్రోలింగ్‌కు గురైన జాన్వీ కపూర్.. దేవర తరహాలో గ్లామర్‌ ఓవర్ డోస్

తర్వాతి కథనం
Show comments