Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితులపై హింస-98 మంది వ్యక్తులకు జీవిత ఖైదు

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (15:15 IST)
కర్ణాటక మరకుంబి గ్రామంలో దళితులపై హింసాత్మక దాడికి పాల్పడినందుకు కొప్పల్‌లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 98 మంది వ్యక్తులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ. 5,000 జరిమానా విధించింది. 
 
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద దోషులపై అభియోగాలు మోపారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, స్పెషల్ జడ్జి సి చంద్రశేఖర్ మరో ముగ్గురికి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. 
 
గంగావతి రూరల్ పోలీసులు దాఖలు చేసిన ఈ కేసులో మొదట 117 మంది పేర్లను నమోదు చేశారు. అయితే కొంతమంది నిందితులు మరణించారు. ఛార్జ్ షీట్‌లో కొందరి పేర్లు పునరావృతమయ్యాయి. 
 
చివరకు 101 మంది నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. హింసాత్మక సంఘటన ఆగష్టు 29, 2014న, గంగావతి తాలూకాలోని మరకుంబి గ్రామం జరిగింది. ఈ సందర్భంగా అగ్రవర్ణాల వ్యక్తుల గుంపు ఎస్సీ కమ్యూనిటీ సభ్యులపై దాడి చేసి, అనేక ఇళ్లకు నిప్పు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

11,500 స్ర్కీన్స్‌ల్లో పుష్ప-2 రిలీజ్‌కు సన్నాహాలు

హీరోయిన్లకు కమిట్ మెంట్స్ వుండవు : అనన్య నాగళ్ల

దేవకీ నందన వాసుదేవ వరల్డ్ వైడ్ రైట్స్ ని సొంతం చేసుకున్న శంకర్ పిక్చర్స్

ప్రభాస్ సరసన మాళవిక మోహనన్.. టాలీవుడ్ ఎంట్రీపై హ్యాపీ

మెగాస్టార్ చిరంజీవికి రాజీనామా ఎంత పని చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

15 రోజులకు ఒక్కసారైనా మహిళలు పైనాపిల్ తీసుకోవాలట

బాదం పప్పుల మంచితనంతో మీ దీపావళి వేడుకలను ఆరోగ్యవంతంగా మలుచుకోండి

తర్వాతి కథనం
Show comments