Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి చొరబడిన చిరుత.. బాలుడుని నోట కరుచుకుని పట్టుకెళ్లింది...

Webdunia
ఆదివారం, 10 మే 2020 (09:59 IST)
కరోనా వైరస్ పుణ్యమాని అనేక పశుపక్ష్యాదులతో పాటు... క్రూరమృగాలు, వన్యప్రాణాలకు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టు అయింది. దేశ వ్యాప్తంగా వాహన రాకపోకలు పూర్తిగా బంద్ కావడంతో అనేక ప్రాంతాల్లో వన్య ప్రాణులు, చిరుతలు, పులులు, ఏనుగులు, జింకలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. అయితే, పలు ప్రాంతాల్లో కొన్ని క్రూరమృగాలు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. దీంతో పలు విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 
 
తాజాగా కర్నాటక రాష్ట్రంలోని రామనగర జిల్లాలో ఓ విషాదకర సంఘటన జరిగింది అటవీ ప్రాంతం నుంచి జనసంచారంలోకి వచ్చిన ఓ చిరుత నేరుగా ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న మూడేళ్ల బాలుడుని నోట కరుచుకుని పట్టుకెళ్లి తినేసింది. 
 
జిల్లాలోని మాగడి తాలూకా కదరయ్యనపాళ్యానికి చెందిన కుటుంబం వేసవి కావడంతో ఇంటి తలుపులు తెరిచి నిద్రపోయింది. వీరు మంచి నిద్రలో ఉండగా అర్థరాత్రి వేళ ఇంట్లోకి చొరబడిన చిరుత వారి మూడేళ్ల కుమారుడు హేమంత్‌ను నోట కరుచుకుని పట్టుకెళ్లింది.
 
ఉదయం లేచి చూసే సరికి కుమారుడు కనిపించకపోవడంతో దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు మంగళగౌరమ్మ, చంద్రప్ప దంపతులు గ్రామస్థులతో కలిసి సమీపంలో గాలించారు. ఇంటికి 60 మీటర్ల దూరంలోని ముళ్ల పొదల్లో బాలుడి మృతదేహం కనిపించినట్టు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత ఆనవాళ్లను సేకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments