Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి చొరబడిన చిరుత.. బాలుడుని నోట కరుచుకుని పట్టుకెళ్లింది...

Webdunia
ఆదివారం, 10 మే 2020 (09:59 IST)
కరోనా వైరస్ పుణ్యమాని అనేక పశుపక్ష్యాదులతో పాటు... క్రూరమృగాలు, వన్యప్రాణాలకు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టు అయింది. దేశ వ్యాప్తంగా వాహన రాకపోకలు పూర్తిగా బంద్ కావడంతో అనేక ప్రాంతాల్లో వన్య ప్రాణులు, చిరుతలు, పులులు, ఏనుగులు, జింకలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. అయితే, పలు ప్రాంతాల్లో కొన్ని క్రూరమృగాలు ఇళ్లలోకి చొరబడుతున్నాయి. దీంతో పలు విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 
 
తాజాగా కర్నాటక రాష్ట్రంలోని రామనగర జిల్లాలో ఓ విషాదకర సంఘటన జరిగింది అటవీ ప్రాంతం నుంచి జనసంచారంలోకి వచ్చిన ఓ చిరుత నేరుగా ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న మూడేళ్ల బాలుడుని నోట కరుచుకుని పట్టుకెళ్లి తినేసింది. 
 
జిల్లాలోని మాగడి తాలూకా కదరయ్యనపాళ్యానికి చెందిన కుటుంబం వేసవి కావడంతో ఇంటి తలుపులు తెరిచి నిద్రపోయింది. వీరు మంచి నిద్రలో ఉండగా అర్థరాత్రి వేళ ఇంట్లోకి చొరబడిన చిరుత వారి మూడేళ్ల కుమారుడు హేమంత్‌ను నోట కరుచుకుని పట్టుకెళ్లింది.
 
ఉదయం లేచి చూసే సరికి కుమారుడు కనిపించకపోవడంతో దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు మంగళగౌరమ్మ, చంద్రప్ప దంపతులు గ్రామస్థులతో కలిసి సమీపంలో గాలించారు. ఇంటికి 60 మీటర్ల దూరంలోని ముళ్ల పొదల్లో బాలుడి మృతదేహం కనిపించినట్టు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత ఆనవాళ్లను సేకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments