Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరూ మోసగాళ్లే.. కాపుల్ని ముంచారు.. కేవలం ఓటు బ్యాంకుగానే?: సత్యనారాయణ

కాపు రిజర్వేషన్లపై ఈ నెల 24లోపు స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోతే.. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ సీఎం చంద్రబాబును కాపు జేఏసీ నేతలు హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహ

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (17:56 IST)
కాపు రిజర్వేషన్లపై ఈ నెల 24లోపు స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోతే.. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ సీఎం చంద్రబాబును కాపు జేఏసీ నేతలు హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి.. ఇద్దరూ కూడా కాపులను మోసం చేశారన్నారు. చంద్రబాబు, జగన్ తమను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని కాపు జేఏసీ నేత సత్యనారాయణ ధ్వజమెత్తారు. 
 
ద్వంద్వ వైఖరితో ఎన్నికలకు వెళ్లిన జగన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. ఇక చంద్రబాబును ఎవరూ అడగకపోయినా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈ నాలుగేళ్లలో ఏదో సాకుతో కాలయాపన చేశారన్నారు. గత ఎన్నికల్లో కేవలం రెండు శాతం‌ ఓట్ల తేడాతోనే గెలిచిన విషయాన్ని బాబు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 
 
ఈ ఇద్దరు నేతలు కూడా కాపులకు అనుకూలంగా ప్రకటనలు చేసి ఆ తరువాత యూ-టర్న్ తీసుకున్నారని సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదని చెప్పిన మాట వాస్తవమే అయినా... దాన్ని మార్చేలా పార్లమెంటులో చట్టం చేసే అవకాశం ఉందని, ఆదిశగా ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదని సత్యనారాయణ ప్రశ్నించారు. 
 
గతంలో బలిజలకు రిజర్వేషన్లు ఇవ్వనని‌ చెప్పిన జగన్.. పార్టీ మేనిఫెస్టోలో మాత్రం పెట్టారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడేమో రిజర్వేషన్ల అంశం ‌కేంద్రం పరిధిలో ఉందని యూ టర్న్ తీసుకొని కాపులను మోసం చేశారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments