Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడు మగాడ్రా బుజ్జీ...కమల్, రజినీలపై గుర్రుగా ఉన్న అభిమానులు..

జయలలిత మరణం తరువాత తమిళనాడులో కొత్త రక్తం వస్తోంది. అందులోను సినీ ప్రముఖులే రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించారు. మొదటి నుంచి సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించే చర్చ జరిగింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులతో కూడా సమావేశమైన రజినీ చివరకు

Webdunia
బుధవారం, 1 నవంబరు 2017 (13:45 IST)
జయలలిత మరణం తరువాత తమిళనాడులో కొత్త రక్తం వస్తోంది. అందులోను సినీ ప్రముఖులే రాజకీయాల్లోకి వస్తారని అందరూ భావించారు. మొదటి నుంచి సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం గురించే చర్చ జరిగింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులతో కూడా సమావేశమైన రజినీ చివరకు వెనక్కి తగ్గి రాజకీయాల్లోకి వెళ్ళడం పూర్తిగా మానేసినట్టున్నారు. రజినీ విషయం పక్కనబెడితే మరో నటుడు కమల్ హాసన్ కూడా అదే ఊపును మొదట్లో ప్రదర్శించాడు.
 
తమిళనాడులో నెలకొన్న సమస్యలపై తాను రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వస్తేనే మంచిదన్న నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇక అందరూ కమల్ హాసన్ ఒకటిరెండు రోజుల్లో పార్టీ పెట్టేస్తారని అనుకున్నారు. కానీ కమల్ కూడా రజినీ బాటలోనే నడిచాడు. ఊరించి ఉసూరుమనిపించాడు. అయితే కన్నడ నటుడు ఉపేంద్ర మాత్రం తాను అనుకున్న విధంగానే పార్టీ పెట్టేశాడు. అనుకున్న సమయానికి, అనుకున్న విధంగానే పార్టీ గుర్తును గీసి ఏకంగా రాజకీయ పార్టీకే పురుడు పోశాడు. ఇప్పుడంతా కన్నడ, పక్కనే ఉన్న తమిళ రాజకీయాలంతా ఉపేంద్ర చుట్టూ తిరుగుతోంది.
 
ఉపేంద్ర పార్టీ పెట్టిన తరువాత అటు కమల్ ఇటు రజినీ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. పార్టీ పెడతామని ఇప్పటివరకు పెట్టని తమ అభిమాన హీరోలపై గుర్రుగా ఉన్నారు. ఉపేంద్రను ఆదర్శంగా తీసుకోనైనా కమల్, రజినీలు  పార్టీ పెట్టాలని కోరుతున్నారు. అయితే అభిమానుల మొరను ఈ హీరోలు ఎంతవరకు పాటిస్తారో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments