Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు భవిష్యత్తులో ఇక వచ్చేది లేదు.. బాలీవుడ్ జంట

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (18:01 IST)
పాకిస్థాన్‌లోని కరాచీలో ఈ నెల 23, 24 తేదీల్లో కైఫీ అజ్మీ కల్చరర్ కార్యక్రమం జరగాల్సి వుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ జంట షబానా అజ్మీ, జావెద్ అక్తర్ హాజరుకావాల్సి వుంది. ఉగ్రదాడికి నిరసనగా ఈ కార్యక్రమానికి తాము రావడం లేదని వీరిద్దరూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. భవిష్యత్తులో పాకిస్థాన్‌లో జరిగే ఏ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరుకాబోమని స్పష్టం చేశారు. 
 
జమ్మూకాశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని యావత్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధిగా చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సైనికుల రాకపోకల సందర్భంగా సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న సైన్యాధికారుల నిర్ణయం తమలో కొందరి ప్రాణాల మీదికి తెచ్చింది. 
 
సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌ వెళ్తుండగా ఆ దారిలో పౌరవాహనాలను అనుమతించడం మానవ బాంబుకు గొప్ప అవకాశంగా మారిందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ చిన్నపొరపాటు వల్లే సీఆర్పీఎఫ్ జవాన్లను కోల్పోయి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments