చొరబాటుదారులు కేన్సర్ రోగులు వంటివారు : కంగనా రనౌత్

ఠాగూర్
బుధవారం, 26 నవంబరు 2025 (18:56 IST)
భారతీయ జనతా పార్టీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చొరబాటుదారులపై మండిపడ్డారు. వారిని కేన్సర్ రోగులతో సమానంగా పోల్చారు. ఇలాంటి వారిని తక్షణం దేశం నుంచి బహిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది బీజేపీ, ఎన్నికల సంఘం పన్నిన కుట్రగా అభివర్ణించారు. భారత ఎన్నిక సంఘం భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘంగా మారిపోయిందంటూ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
 
ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ మండిపడ్డారు. చొరబాటుదారులను క్యాన్సర్‌తో పోల్చారు. వారిని దేశం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. 'ఇటువంటి బెదిరింపులకు దేశం భయపడదు. చొరబాటుదారులను తొలగించాలని అందరూ కోరుకుంటున్నారు. వీరంతా శరీరంలో క్యాన్సర్ లాంటివారు. వారిని సాగనంపాల్సిందే' అని కంగనా రనౌత్ అన్నారు. 
 
అయోధ్య రామాలయం ధ్వజారోహణ కార్యక్రమంపై పాకిస్థాన్‌ విదేశాంగశాఖ చేసిన ప్రకటనపైనా మండిపడ్డారు. 'రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతుండటంతో పాకిస్థాన్ భయపడుతోంది. ఆ దేశం ఓ భిక్షాటన పాత్రగా మారింది. భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. త్వరలో మరింత ముందుకెళ్లనుంది' అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

రివాల్వర్ రీటా పర్ఫెక్ట్ కమర్షియల్ డార్క్ కామెడీ ఫిల్మ్ : కీర్తి సురేష్

రోషన్, అనస్వర రాజన్.. ఛాంపియన్ నుంచి గిర గిర గింగిరాగిరే సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments