Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో దారుణం.. బాలికపై అధ్యాపకుడి హత్యాచారం.. ఎవరూ లేని తరగతి గదిలో..?

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (17:02 IST)
మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. జార్ఖండ్‌లో ఓ బాలికపై అధ్యాపకుడు హత్యాచారానికి పాల్పడ్డాడు. అది కూడా గణతంత్ర దినోత్సవం రోజునే ఈ ఘటన చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. పలమౌ జిల్లా పంకికి చెందిన బాలిక ఈనెల 26న పాఠశాలకు వెళ్లింది. 
 
ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శంభు సింగ్‌(35) ఆ బాలికను ఎవరూ లేని తరగతి గదికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. తర్వాత.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పొద్దంటూ బాలికను, ఆమె తల్లిదండ్రులను బెదిరించాడు. అదేరోజు రాత్రి విద్యార్థిని ఇంటికి వెళ్లిన అతను బాలికకు విషపు గుళికలు తినిపించాడు. 
 
కొద్దిసేపటికి ఆ బాలిక అపస్మారక స్థితికి వెళ్లింది. తల్లిదండ్రులు తమ కూతురిని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మరణించింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. బాధిత కుటుంబానికి, ఉపాధ్యాయుడికి మధ్య భూతగాదాలున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments