Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొగ్గు స్కామ్‌లో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి!

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (15:36 IST)
బొగ్గు స్కామ్‌లో కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రే దోషిగా తేలారు. ఈయనతో పాటు.. మరో ముగ్గురు కూడా ముద్దాయిలుగా పేర్కొంటూ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. వీరికి ఈ నెల 14వ తేదీన శిక్షలను ఖరారు చేయనుంది. 
 
గత 1999లో జార్ఖండ్‌ రాష్ట్రంలోని బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్ర‌మాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా, 1999లో జార్ఖండ్‌లోని గిరిధిలో ఉన్న బ్ర‌హ్మ‌దిహ బొగ్గు గ‌నుల‌ను కాస్ట్రాన్ టెక్నాల‌జీస్ లిమిటెడ్‌కు కేటాయించగా, ఇందులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.   దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ఈ కేసు విచారణ సుధీర్ఘంగా సాగింది.
 
ఈ స్కామ్ మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి హయాంలో జరిగింది. ఆసమయంలో దిలీప్ రే కేంద్ర ఉక్కు, బొగ్గు శాఖామంత్రిగా పని చేశారు. దీంతో ఈ స్కామ్‌లో ఆయనతో పాటు.. మరో ముగ్గురు అవినీతికి పాల్పడినట్టు ప్రత్యేక న్యాయస్థానం గుర్తించింది. ఈ నలుగురు దోషులు నేర‌పూరిత కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లు ప్ర‌త్యేక జ‌డ్జి భార‌త్ ప‌రాశ‌ర్ తెలిపారు. 
 
కాగా, దిలీప్‌తో పాటు దోషులుగా తేలిన వారిలో బొగ్గుగ‌నుల శాఖ‌లో ప‌నిచేసిన సీనియ‌ర్ అధికారులు కూడా ఉన్నారు. ఈ నెల 14న కోర్టు వీరందరికీ శిక్షను ఖరారు చేయనుంది. ఈ నలుగురు ఈ కేసు తీర్పు సందర్భంగా ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments