Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో మంటలు చెలరేగాయంటూ పుకార్లు : భయంతో కిందకు దూకిన ప్రయాణికులు.. ముగ్గురు మృతి!!

వరుణ్
శనివారం, 15 జూన్ 2024 (08:38 IST)
రైలులో మంటలు చెలరేగాయంటూ గుర్తు తెలియని వ్యక్తలుు పుకార్లు పుట్టించారు. దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వీరిలో కొందరు రైలు నుంచి దూకేశారు. అలాంటి వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కుమన్‌డీహ్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. రాంచీ - ససరామ్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు అంటుకున్నాయంటూ కొందరు పుకార్లు పుట్టించారు. దీంతో ముగ్గురు ప్రయాణికులు రైలు నుంచి కిందకు దూకేశారు. 
 
ఇదే సమయంలో మరో ట్రాక్‌పై నుంచి వస్తున్న గూడ్సు రైలు వారిని ఢీకొట్టడంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రైలులో మంటలు చెలరేగాయని స్టేషన్ మాస్టర్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో ఆయన రైలును ఆపివేశాడు. ఆ వెంటనే భయంతో ముగ్గురు ప్రయాణికులు ఒకే ట్రాక్‌పై దూకడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటన వెనుక ఏదైనా లక్ష్యంగా ఉందా లేదా నక్సల్స్ చర్యా అన్న కోణంలో రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments