#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

ఠాగూర్
ఆదివారం, 19 అక్టోబరు 2025 (18:05 IST)
జేఈఈ మెయిన్ పరీక్ష 2026 (JEEMain2026)కు సన్నద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. రెండు సెషన్లలో నిర్వహించే ఈ పరీక్ష తొలి సెషన్‌ను జనవరి నెలలో, రెండో సెషన్‌ను ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నారు. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించి షెడ్యూల్‍ను ఎన్.టి.ఏ ఆదివారం విడుదల చేసింది. జనవరి 21వ తేదీ నుంచి 30వ తేదీల మధ్య జేఈఈ మెయిన్స్-1, ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య రెండో సెషన్ పరీక్షను నిర్వహించనున్నట్టు ఎన్టీఏ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షకు ఈ నెల నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు వెబ్ సైట్‌లో అందుబాటులోకి వస్తాయని ఎన్టీఏ  వెల్లడించింది. సెషన్-2కు పరీక్షకు జనవరి నెలాఖరు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశ వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థుల హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం పరీక్షల నిర్వహణ కేంద్రాలను కూడా పెంచనున్నారు. దివ్యాంగ అభ్యర్థుల అవసరాలను తీర్చడంపై కూడా ఈ దఫా దృష్టి కేంద్రీకరించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments