జేఈఈ మెయిన్ షెడ్యూల్ రిలీజ్ - పరీక్షలు ఎప్పటి నుంచంటే...

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (08:31 IST)
జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పరీక్ష కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) ఈ షెడ్యూల్ వెల్లడించింది. గురువారం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఐఐటీల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మెయిన్ సెషన్-1 పరీక్షలను జనవరి 24-31వ తేదీల మధ్య నిర్వహిస్తారు. 26వ తేదీన రిపబ్లిక్ డే కావడంతో ఆ రోజున మాత్రం ఈ ప్రవేశ పరీక్ష ఉండదు.
 
ఈ పరీక్షకు గురువారం నుంచే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షల కోసం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ సహా మొత్తం 13 భారతీయ ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు సిద్ధం చేస్తున్నారు. 
 
కాగా, జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉందని ఎన్.టి.ఏతెలిపింది. సెషన్-2 కోసం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. 202-2022 సంవత్సరాలుల్ 12వ తరగతి లేదంటే అందుకు సమానమైన గుర్తింపు కలిగిన విద్యార్హత ఉన్నవారు ఈ పరీక్షలను రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments