Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్ షెడ్యూల్ రిలీజ్ - పరీక్షలు ఎప్పటి నుంచంటే...

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (08:31 IST)
జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పరీక్ష కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్.టి.ఏ) ఈ షెడ్యూల్ వెల్లడించింది. గురువారం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఐఐటీల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మెయిన్ సెషన్-1 పరీక్షలను జనవరి 24-31వ తేదీల మధ్య నిర్వహిస్తారు. 26వ తేదీన రిపబ్లిక్ డే కావడంతో ఆ రోజున మాత్రం ఈ ప్రవేశ పరీక్ష ఉండదు.
 
ఈ పరీక్షకు గురువారం నుంచే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 24వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ పరీక్షల కోసం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ సహా మొత్తం 13 భారతీయ ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు సిద్ధం చేస్తున్నారు. 
 
కాగా, జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉందని ఎన్.టి.ఏతెలిపింది. సెషన్-2 కోసం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. 202-2022 సంవత్సరాలుల్ 12వ తరగతి లేదంటే అందుకు సమానమైన గుర్తింపు కలిగిన విద్యార్హత ఉన్నవారు ఈ పరీక్షలను రాశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments