Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నమ్మ వచ్చేస్తుందా? ఏకం కానున్న పన్నీర్...పళని..

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (18:09 IST)
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం తన పంతం నెగ్గించుకుంటున్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై జ్యూడీషియల్ విచారణకు.. ఇప్పటికే అన్నాడీఎంకే సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి పళనిసామి సర్కారు ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా తమిళనాడులో శశికళ వర్గానికి వ్యతిరేకంగా సీఎం పళనిసామి.. మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఒక్కటయ్యేందుకు మరో ముందడుగు పడింది. 
 
ఇక పరప్పన జైలులో అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ త్వరలో విడుదలయ్యే అవకాశం వుండటంతో పళని, పన్నీర్ ఇద్దరూ ఏకమై అమ్మ మృతిపై మరింత లోతుగా విచారణ జరపేందుకే జ్యుడీషియల్ విచారణకు రంగం సిద్ధం చేశారని టాక్ వస్తోంది. అలాగే పొయెస్‌ గార్డెన్స్‌లోని వేద నిలయాన్ని జయలలిత స్మారక చిహ్నంగా మారుస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 
 
వేద నిలయం ప్రస్తుతం శశికళ ఆధీనంలోనే ఉన్నందున ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే అన్నాడీఎంకేలో అమ్మ, పురట్చి తలైవి శిబిరాలు విలీనం అవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో పళినిస్వామి పన్నీర్ సెల్వంతో కలిసి శశికళ, దినకరన్‌కు చెక్‌ పెట్టేందుకు సిద్ధమయ్యారు. తద్వారా చిన్నమ్మ వచ్చినా.. పార్టీలో ఆమె ప్రమేయం లేకుండా చేేసేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments