Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయ్.. ఫోటోలు తీయడం ఆపు.. కాంతి కళ్ళలో పడుతుంది... ఫోటోగ్రాఫర్లపై జయా బచ్చన్ ఫైర్

మీడియా ఫోటోగ్రాఫర్లపై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి, ఎంపీ జయాబచ్చన్ మండిపడ్డారు. ఏయ్... ఫోటోలు తీయడం ఆపు.. కాంతి కళ్ళలో పడుతుంది. అది నాకు నచ్చదు అంటూ కళ్ళెర్రజేశారు.

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (16:51 IST)
మీడియా ఫోటోగ్రాఫర్లపై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి, ఎంపీ జయాబచ్చన్ మండిపడ్డారు. ఏయ్... ఫోటోలు తీయడం ఆపు.. కాంతి కళ్ళలో పడుతుంది. అది నాకు నచ్చదు అంటూ కళ్ళెర్రజేశారు. ముంబైలోని ఓ కాలేజీలో జరుగుతున్న కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. 
 
ఫోటోలు తీయడం ఆపాలంటూ నానా హంగామా చేశారు. ఫోటోలు తీయడం తనకు నచ్చదని... కాంతి కళ్లలో పడటం తనకు ఇబ్బందిగా ఉందని ఆమె చెప్పారు. అంతేకాదు, భారతీయులుగా కనీస గౌరవం మీకు లేదా? కెమెరా గానీ, మొబైల్ కానీ ఉంటే ఎక్కడైనా, ఏ సమయంలోనైనా సదరు వ్యక్తి అనుమతి లేకుండా ఫోటోలు తీస్తారా? అంటూ ప్రశ్నించారు. 
 
ఆమె విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో ఫోటోలు తీస్తుండగా ఆమె మైక్‌ను కింద పడేశారు. ఫోటోలు తీయడం అయిపోయిన తర్వాత మాట్లాడతానంటూ అసహనానికి లోనయ్యారు. ప్రెస్‌కు, మీడియాకు తాను వ్యతిరేకం కాదని అయితే ఎక్కడ కనిపించినా ఫోటోలు తీసి ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. అంతేకాదండోయ్.. విద్యార్థులపై కూడా ఆమె నిప్పులు చెరిగారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments