Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జన్‌ధన్' నగదు ఎప్పుడెవరు తీసుకోవచ్చంటే..?!

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (08:33 IST)
ప్రధాన మంత్రి జన్​ధన్​ ఖాతాల్లోని నగదు ఉపసంహరణకు కేంద్రం ఆంక్షలు విధించింది. ఖాతా సంఖ్యల ఆధారంగా తేదీలు కేటాయించింది. ప్రధాన మంత్రి జన్​ధన్‌ ఖాతాల్లో రూ.500 చొప్పున మూడు నెలలపాటు జమ చేయనున్న కేంద్రం.. రేపటి నుంచి నగదు ఉపసంహరించుకోవచ్చని వెల్లడించింది.

కరోనా ప్రభావం కారణంగా ఖాతాదారులు అంతా ఒకేసారి బ్యాంకుల వద్దకు వెళ్లకుండా నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించింది. జన్​ధన్‌ ఖాతాదారులు ఆంధ్రప్రదేశ్‌లో 1,18,55,366 మంది ఉండగా.. తెలంగాణలో 52 లక్షల 23వేల 218 ఖాతాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,70,78,584 జన్​ధన్‌ ఖాతాలున్నాయి.

ఒక్కసారిగా ఖాతాదారులు బ్యాంకు శాఖలకు, ఏటీఎంల వద్దకు నగదు ఉపసంహరణ కోసం గుమిగూడే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు.

ఖాతా సంఖ్య చివరన.. 0 లేక 1 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 3న, 2 లేక 3 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 4న, 4 లేక 5 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 7న, 6 లేక 7 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 8న, 8 లేక 9 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 9న నగదు తీసుకోవచ్చని తెలిపింది.

ఈ నెల 9వ తేదీ లోపు నగదు తీసుకోలేని ఖాతాదారులు తరువాత అయినా తీసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments