Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జన్‌ధన్' నగదు ఎప్పుడెవరు తీసుకోవచ్చంటే..?!

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (08:33 IST)
ప్రధాన మంత్రి జన్​ధన్​ ఖాతాల్లోని నగదు ఉపసంహరణకు కేంద్రం ఆంక్షలు విధించింది. ఖాతా సంఖ్యల ఆధారంగా తేదీలు కేటాయించింది. ప్రధాన మంత్రి జన్​ధన్‌ ఖాతాల్లో రూ.500 చొప్పున మూడు నెలలపాటు జమ చేయనున్న కేంద్రం.. రేపటి నుంచి నగదు ఉపసంహరించుకోవచ్చని వెల్లడించింది.

కరోనా ప్రభావం కారణంగా ఖాతాదారులు అంతా ఒకేసారి బ్యాంకుల వద్దకు వెళ్లకుండా నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించింది. జన్​ధన్‌ ఖాతాదారులు ఆంధ్రప్రదేశ్‌లో 1,18,55,366 మంది ఉండగా.. తెలంగాణలో 52 లక్షల 23వేల 218 ఖాతాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,70,78,584 జన్​ధన్‌ ఖాతాలున్నాయి.

ఒక్కసారిగా ఖాతాదారులు బ్యాంకు శాఖలకు, ఏటీఎంల వద్దకు నగదు ఉపసంహరణ కోసం గుమిగూడే అవకాశం ఉందని అంచనా వేసిన అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు.

ఖాతా సంఖ్య చివరన.. 0 లేక 1 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 3న, 2 లేక 3 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 4న, 4 లేక 5 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 7న, 6 లేక 7 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 8న, 8 లేక 9 అంకె ఉన్న ఖాతాదారులు ఈ నెల 9న నగదు తీసుకోవచ్చని తెలిపింది.

ఈ నెల 9వ తేదీ లోపు నగదు తీసుకోలేని ఖాతాదారులు తరువాత అయినా తీసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments