Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరాకర్ నదిలో పడవ ప్రమాదం : 14 మంది జలసమాధి

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (15:25 IST)
జార్ఖండ్ రాష్ట్రంలోని జామ్‌తాడ జిల్లాలోని బరాకర్ నదిలో పడవ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది జలసమాధి అయ్యారు. సమాచారం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికి తీశారు. ఈ మృతదేహాలను గుర్తించి వారివారి బంధువులకు అప్పగించారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్టు జమార్తా డిప్యూటీ కమిషనర్ పైజ్ అహ్మద్ ముంతాజ్ వెల్లడించారు. 
 
కాగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ వెల్లడించారు. గత నెల 24వ తేదీన సాయంత్రం 6 గంటలకు బరాకర్ నదిలో జామ్‌తాడ నుంచి నిర్సాకు వెళుతున్న బోటు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో వీచిన బలమైన ఈదురుగాలులు, తుఫాను వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments