Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన మరుసటిరోజే నవ వధువు అదృశ్యం.. భర్తను వీడి...

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (16:03 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. పెళ్లియిన మరుసటిరోజే నవ వధువు అదృశ్యమైంది. భర్తను వదిలి రాత్రికి రాత్రే వెళ్ళిపోయిన ఈ వధువు.. తనకు ఇష్టమైన లెస్బియన్ వద్ద పడక గదిలో ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌కు చెందిన ఓ యువతికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికిచ్చి ఈనెల 5వ తేదీన వివాహం జరిపారు. ఆ మరుసటి రోజే నవవధువు కనిపించకుండా పోయింది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు... ఆ యువతి కోసం దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆ వధువు హర్యానా రాష్ట్రంలోని మనేసర్‌లో ఉన్నట్టు గుర్తించారు. 
 
ఆ తర్వాత ఆమె వద్ద ఆరా తీయగా, తన లెస్బియన్ భాగస్వామితో కలిసి ఉండేందుకు తాను తన భర్తకు దూరమైనట్టు చెప్పింది. ఈ మాటలు విన్న కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అదేసమయంలో నవ వధువుతో నాలుగేళ్లుగా సాన్నిహత్యం కొనసాగిస్తూ వచ్చిన యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments