Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీలు తీసుకుంటుండగా పిడుగులు.. 11మంది మృతి

Webdunia
సోమవారం, 12 జులై 2021 (11:54 IST)
సెల్ఫీలు తీసుకుంటుండగా పిడుగులు పడటంతో 11 మంది మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. 
 
జైపూర్‌లోని 12వ శతాబ్దానికి చెందిన అమర్‌ ప్యాలెస్‌ను సందర్శించేందుకు 27 మంది పర్యాటకులు వెళ్లారు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగులు పడటంతో 11 మంది మరణించారు. భయాందోళనలతో టవర్‌పై నుండి దూకడంతో మరికొంతమందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పిడుగుల ఘటనల్లో తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. 
 
బరాన్‌, జల్వార్‌లలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, కోటాలో నలుగురు, ధోల్‌పూర్‌ జిల్లాలో ముగ్గురు మరణించారు. మృతిచెందినవారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు వివరించారు. కాగా, ఈ ఘటనల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ రూ. 5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ ఘటనలపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments