Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీలు తీసుకుంటుండగా పిడుగులు.. 11మంది మృతి

Webdunia
సోమవారం, 12 జులై 2021 (11:54 IST)
సెల్ఫీలు తీసుకుంటుండగా పిడుగులు పడటంతో 11 మంది మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. 
 
జైపూర్‌లోని 12వ శతాబ్దానికి చెందిన అమర్‌ ప్యాలెస్‌ను సందర్శించేందుకు 27 మంది పర్యాటకులు వెళ్లారు. అదే సమయంలో ఒక్కసారిగా పిడుగులు పడటంతో 11 మంది మరణించారు. భయాందోళనలతో టవర్‌పై నుండి దూకడంతో మరికొంతమందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పిడుగుల ఘటనల్లో తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. 
 
బరాన్‌, జల్వార్‌లలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, కోటాలో నలుగురు, ధోల్‌పూర్‌ జిల్లాలో ముగ్గురు మరణించారు. మృతిచెందినవారిలో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు వివరించారు. కాగా, ఈ ఘటనల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ రూ. 5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ ఘటనలపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments