Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నుకు బుల్లెట్ తగిలినా బిడ్డకు జన్మనిచ్చిన జవాను భార్య

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సంజువాన్‌లోని ఆర్మీ శిబిరంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి జరిపాయి. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు కూడా వీరమరణం చెందారు. అయితే, ఇదే కాల్పుల్లో గాయపడిన ఓ జవాను భార్య మాత్రం ఓ

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (13:01 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని సంజువాన్‌లోని ఆర్మీ శిబిరంపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు దాడి జరిపాయి. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు కూడా వీరమరణం చెందారు. అయితే, ఇదే కాల్పుల్లో గాయపడిన ఓ జవాను భార్య మాత్రం ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణి వెన్నెముకకు బుల్లెట్ గాయం తగిలినప్పటికీ ఆమె ప్రసవించిన బిడ్డకు మాత్రం చిన్న గాయం కూడా కాలేదు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ముష్కర మూకల కాల్పుల్లో రైఫిల్‌ మ్యాన్ నజీర్‌ అహ్మద్‌తో పాటు ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. నిండు గర్భిణి అయిన ఆమెను వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌లో జమ్మూలోని సైనిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేశారు. 
 
ఆ తర్వాత అంటే ఆదివారం రాత్రి సిజేరియన్ తర్వాత ఆడశిశువుకు జన్మిచ్చింది. తల్లీకూతుళ్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆర్మీ డాక్టర్లు తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బాధితురాలి వెన్నెముకకు బుల్లెట్ తగిలింది. అయితే ఆమె కడుపులో ఉన్న పాపకు చిన్న గాయం కూడా కాకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments