Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యను గొడ్డలితో నరికి... సూసైడ్ చేసుకున్న బీఎస్ఎఫ్ జవాను

భారత సరిహద్దులను రక్షించే ఓ జవాను కిరాతక చర్యకు పాల్పడ్డాడు. క్షణికావేశంలో తన భార్యను గొడ్డలితో నరికేసి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని రెవాడీ పరిధిలోని కుమ్రోడా గ్రామం

భార్యను గొడ్డలితో నరికి... సూసైడ్ చేసుకున్న బీఎస్ఎఫ్ జవాను
, బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (11:44 IST)
భారత సరిహద్దులను రక్షించే ఓ జవాను కిరాతక చర్యకు పాల్పడ్డాడు. క్షణికావేశంలో తన భార్యను గొడ్డలితో నరికేసి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని రెవాడీ పరిధిలోని కుమ్రోడా గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కుమ్రోడా నివాసి జయప్రకాష్(52) బీఎస్ఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. జనవరిలో సెలవుమీద గ్రామానికివచ్చి ఉంటున్నాడు. అతని ఇద్దరు పిల్లలు, తల్లి బయటకు వెళ్లిన సందర్భంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 
 
అపుడు క్షణికావేశానికు గురైన జవాను... ఆగ్రహంతో ఊగిపోతూ జయప్రకాష్ గొడ్డలి తీసుకుని భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తర్వాత అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు.
 
ఈ ఘటనను చూసిన జవాను తల్లి చుట్టుపక్కలవారికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ జంట మృత దేహాలను పోస్టుమార్టంనకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"గాలి" మృతి చిత్తూరు జిల్లాకు తీరని లోటు : వైకాపా ఎమ్మెల్యే రోజా