Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"గాలి" మృతి చిత్తూరు జిల్లాకు తీరని లోటు : వైకాపా ఎమ్మెల్యే రోజా

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం చిత్తారు జిల్లాకు తీరని లోటని వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె.రోజా అభిప్రాయపడ్డారు.

, బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (11:35 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం చిత్తారు జిల్లాకు తీరని లోటని వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె.రోజా అభిప్రాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి గాలి ముద్దుకృష్ణమ హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతిపై రోజా తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
ఇందులో... చిత్తూరు జిల్లాలోనే సీనియ‌ర్ నాయ‌కుల్లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మ‌ నాయుడు హ‌ఠాత్తుగా మ‌ర‌ణించ‌డం దుర‌దృష్ట‌క‌రమన్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ప‌నిచేసిన సుదీర్ఘ అనుభ‌వం క‌లిగిన ముద్దు కృష్ణ‌మ‌నాయుడు మ‌ర‌ణించ‌డం చిత్తూరు జిల్లాకు తీర‌ని లోటన్నారు.
 
ఒక సాధార‌ణ ఉపాధ్యాయుడిగా ప‌నిచేసిన గాలిముద్దుకృష్ణ‌మ‌నాయుడు విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేయ‌డం ఆయ‌న జీవితంలోని అరుదైన సంద‌ర్భమన్నారు. తెలుగుదేశం పార్టీలో నేను ఆయ‌న క‌లిసి ప‌నిచేసిన సంద‌ర్భాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాగా, ఆరు సార్లు పుత్తూరు, న‌గ‌రి ఎమ్మెల్యేగా ప‌నిచేసిన ఆయ‌న నిరాండ‌బ‌రుడుగా పేరు తెచ్చుకున్నారనీ, అలాంటి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు అకాల‌మ‌ర‌ణానికి చింతిస్తూ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నట్టు రోజా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దడపుట్టిస్తున్న టీడీపీ ఎంపీలు.. వైకాపా ఎంపీల్లో కదలిక