Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటితో ఐటీ రిటర్న్స్‌ (ఐటీఆర్)కు ఆఖరు తేదీ..

Webdunia
సోమవారం, 31 జులై 2023 (07:43 IST)
దేశంలో ఆదాయపన్ను రిటర్న్స్‌లు (ఐటీఆర్) దాఖలు చేసేవారి చివరి తేదీ జూలై 31వ తేదీ సోమవారంతో ముగియనుంది. దీంతో అనేక మంది ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు పోటీపడుతున్నారు. గత 2022లో మొత్తం 7.4 కోట్ల మంది ఐటీ రిటర్న్స్‌లు దాఖలు చేయగా ఈ యేడాది ఇప్పటివరకు 5.83 కోట్ల మంది ఐటీఆర్‌లు దాఖలు చేశారు. ఐటీ రిటర్నుల దాఖలుకు నేడు తుది గడువు కావడంతో భారీ సంఖ్యలో ఐటీఆర్‌లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. 
 
ఆదివారం ఒక్కరోజే భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. చివరి ఒక గంట వ్యవధిలో ఏకంగా 3.04 లక్షల రిటర్నులు దాఖలయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ఐటీ పోర్టల్‌లోకి 1.78 కోట్ల మంది లాగిన్ కాగా, సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెప్పారు. సెలవు రోజైన ఆదివారం మధ్యాహ్నం వరకు 10.39 లక్షల ఐటీఆర్‌లు దాఖలు కావడం గమనార్హం. 
 
కాగా, ఇప్పటివరకు దాఖలు చేసినవారే కాదు.. ఇంకా దాఖలు చేయాల్సినవారు 2 కోట్లమందికి పైగా ఉన్నారు. వీరంతా ఆఖరు రోజైన సోమవారం దాఖలు చేసేందుకు పోటీపడే అవకాశం. జూలై 31వ తేదీ తర్వాత అపరాధ రుసుంతో ఐటీఆర్ దాఖలు అనుమతిస్తామని ఆదాయన్నుశాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments