Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటితో ఐటీ రిటర్న్స్‌ (ఐటీఆర్)కు ఆఖరు తేదీ..

Webdunia
సోమవారం, 31 జులై 2023 (07:43 IST)
దేశంలో ఆదాయపన్ను రిటర్న్స్‌లు (ఐటీఆర్) దాఖలు చేసేవారి చివరి తేదీ జూలై 31వ తేదీ సోమవారంతో ముగియనుంది. దీంతో అనేక మంది ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేసేందుకు పోటీపడుతున్నారు. గత 2022లో మొత్తం 7.4 కోట్ల మంది ఐటీ రిటర్న్స్‌లు దాఖలు చేయగా ఈ యేడాది ఇప్పటివరకు 5.83 కోట్ల మంది ఐటీఆర్‌లు దాఖలు చేశారు. ఐటీ రిటర్నుల దాఖలుకు నేడు తుది గడువు కావడంతో భారీ సంఖ్యలో ఐటీఆర్‌లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. 
 
ఆదివారం ఒక్కరోజే భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. చివరి ఒక గంట వ్యవధిలో ఏకంగా 3.04 లక్షల రిటర్నులు దాఖలయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ఐటీ పోర్టల్‌లోకి 1.78 కోట్ల మంది లాగిన్ కాగా, సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెప్పారు. సెలవు రోజైన ఆదివారం మధ్యాహ్నం వరకు 10.39 లక్షల ఐటీఆర్‌లు దాఖలు కావడం గమనార్హం. 
 
కాగా, ఇప్పటివరకు దాఖలు చేసినవారే కాదు.. ఇంకా దాఖలు చేయాల్సినవారు 2 కోట్లమందికి పైగా ఉన్నారు. వీరంతా ఆఖరు రోజైన సోమవారం దాఖలు చేసేందుకు పోటీపడే అవకాశం. జూలై 31వ తేదీ తర్వాత అపరాధ రుసుంతో ఐటీఆర్ దాఖలు అనుమతిస్తామని ఆదాయన్నుశాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments