Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు: పరుపు కింద నోట్ల కట్టలు.. రూ.42 కోట్లు స్వాధీనం

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (14:42 IST)
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.. ఐటీ అధికారులు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.42 కోట్ల నగదును పట్టుకున్నారు. ఓ ఇంట్లో పరుపు కింద దాచిన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఓ మాజీ మహిళా కార్పొరేటర్, ఆమె భర్తను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో.. బెంగళూరులో ఆదాయపు పన్నుశాఖ దాడులు చేపట్టింది. 
 
నగల దుకాణాల యజమానులు, ఇతరుల నుంచి ఈ భారీ మొత్తాన్ని వారు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న ఐటీ అధికారులు బెంగళూరు నగరంలో దాడులు నిర్వహించారు. 
 
ఆర్టీ నగర్‌లోని ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాటులో తనిఖీలు చేపట్టి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెడ్ కింద 23 పెట్టెల్లో దాచిపెట్టిన రూ.500 నోట్ల కట్టలను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ మొత్తం రూ.42 కోట్లని తేలింది. 
 
ఈ ఫ్లాట్ ఖాళీగా వుంది. ఆ మాజీ కార్పొరేటర్ భర్త ఓ కాంట్రాక్టర్ అని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఐటీ అధికారులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం