Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరు: పరుపు కింద నోట్ల కట్టలు.. రూ.42 కోట్లు స్వాధీనం

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (14:42 IST)
కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.. ఐటీ అధికారులు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.42 కోట్ల నగదును పట్టుకున్నారు. ఓ ఇంట్లో పరుపు కింద దాచిన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఓ మాజీ మహిళా కార్పొరేటర్, ఆమె భర్తను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో.. బెంగళూరులో ఆదాయపు పన్నుశాఖ దాడులు చేపట్టింది. 
 
నగల దుకాణాల యజమానులు, ఇతరుల నుంచి ఈ భారీ మొత్తాన్ని వారు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం అందుకున్న ఐటీ అధికారులు బెంగళూరు నగరంలో దాడులు నిర్వహించారు. 
 
ఆర్టీ నగర్‌లోని ఆత్మానంద కాలనీలోని ఓ ఫ్లాటులో తనిఖీలు చేపట్టి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెడ్ కింద 23 పెట్టెల్లో దాచిపెట్టిన రూ.500 నోట్ల కట్టలను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ మొత్తం రూ.42 కోట్లని తేలింది. 
 
ఈ ఫ్లాట్ ఖాళీగా వుంది. ఆ మాజీ కార్పొరేటర్ భర్త ఓ కాంట్రాక్టర్ అని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఐటీ అధికారులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం