Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హస్తినలోని జర్నలిస్టుల నివాసాల్లో ఢిల్లీ పోలీసుల సోదాలు

delhi police
, మంగళవారం, 3 అక్టోబరు 2023 (16:05 IST)
దేశ రాజధాని ఢిల్లీలో పలువురు జర్నలిస్టుల నివాసాల్లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ప్రముఖ న్యూస్ పోర్టల్ 'న్యూస్లైక్'కు చైనాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ కార్యాలయంతో పాటు అందులో పనిచేసే జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లలో సోదాలు చేశారు. 
 
ఈ సోదాలు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్లోని 30కి పైగా ప్రాంతాల్లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భారీ స్థాయిలో నిర్వహిస్తోంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద సదరు సంస్థపై కేసు నమోదు చేసింది. ఈ దాడుల్లో జర్నలిస్టులు, ఉద్యోగులకు సంబంధించిన ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకుంది.
 
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. న్యూస్ క్లిక్ సంస్థ మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే రూ.38.05 కోట్ల మేర విదేశీ నిధుల మోసం జరిగిందని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఆ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించిందని ఈడీ ఆరోపించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోతీలాల్ ఓస్వాల్ AMC మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ 500 ఇటిఎఫ్‌ ప్రారంభం