Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ధిక వ్యవస్థలు కోలుకోవడానికి చాలా సమయం: ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (07:36 IST)
ఈ ఏడాది చివరి నాటికే కరోనా వ్యాక్సిన్‌ వచ్చినప్పటికీ ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు కోలుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుందని ప్రముఖ ఆర్ధికవేత్త, ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ పేర్కొన్నారు.

ఆయా దేశాలు కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా కట్టడి చేసినప్పటికీ ఆర్ధిక వ్యవస్థలు కోలుకోవడానికి దీర్ఘకాలం పడుతుందని రఘురామ్‌ అన్నారు.

కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంటుందని, ఇందుకోసం నెలల పాటు సమయం పడుతుందని, ఈలోపుగా వ్యాక్సిన్‌ వేసుకున్న వాళ్లు భద్రతగా భావించే అవకాశం లేదని, వారు బయటికి వచ్చి భారీగా ఖర్చు చేసే అవకాశం లేదన్నారు.

2020 డిసెంబర్‌ నాటికే వ్యాక్సిన్లు వచ్చినప్పటికీ ఆర్ధిక వ్యవస్థలో చలనం రావడానికి 2021 మధ్య కాలం అవుతుందని రాజన్‌ అన్నారు.

భారత్‌ లాంటి దేశాల్లో దీర్ఘకాలం లాక్‌డౌన్‌ కొనసాగిందని, సడలింపులు ఇచ్చినప్పటికీ ప్రజలు బయటకు రావడం లేదని, ఖర్చు పెట్టడం లేదని అందువల్ల ఆర్ధిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం ఆలస్యమౌతోందని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments