Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో అత్తరు వ్యాపారులను టార్గెట్ చేసిన ఐటీ శాఖ - మరో వ్యాపారి ఇంట్లో...

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (14:09 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అత్తరు వ్యాపారుల ఇళ్లను ఆదాయా పన్ను శాఖ అధికారులు టార్గెట్ చేశారు. మొన్నటికిమొన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడుగా భావించే అత్తరు వ్యాపారి పియూష్ జైన్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. 
 
ఈ తనిఖీల్లో రూ.257 కోట్ల నగదు, 250 కేజీల వెండి, 25 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు ఒక్క యూపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 
 
తాజాగా మరో అత్తరు వ్యాపారి, ఎస్పీ ఎమ్మెల్సీ పంపి జైన్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. పియూష్ జైన్‌తో పాటు తన వ్యాపారులతో ఎస్పీకి సంబంధం లేదని పంపి జైన్ స్పష్టం చేశారు. పైగా, పియూష్ రాజ్ ఎవరికి సన్నిహితమో వారి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. 
 
ఈయన ఇటీవలే అత్తరు వ్యాపారాన్ని ప్రారంభించారు. పైగా, ఐటీ సోదాలు జరిగిన సమయంలో ఈయన ఇంట్లో లేరు. 90 యేళ్ళ తన తల్లితో కలిసి ముంబైకు వెళ్ళారు. ముంబైలోని కన్నౌజ్‌లో తమ ఇల్లు ఉందని, ముంబైకు యేడాదికి మూడునాలుగు సార్లు వెళుతుంటామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments