Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి మరో కేంద్ర మంత్రి రవిశంకర్

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (18:45 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన గుర్గావ్‌లో ఉన్న మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయనతో భేటీ అయిన వారంతా ఇపుడు సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియా సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లగా, ఇపుడు మరో కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. 
 
తనను కలిసిన అందరూ ఐసొలేషన్‌లోకి వెళ్లాలని, కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని అమిత్ షా సూచించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయనను కలిసిన పలువురు ఇప్పటికే ఐసొలేషన్‌లోకి వెళ్లిపోయారు. మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది.
 
మరోవైపు, దేశంలో కొవిడ్‌-19 కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. కరోనా కేసుల సంఖ్య 18 లక్షల మార్కును దాటింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 52,972 మందికి కొత్తగా కరోనా సోకింది. అదేసమయంలో 771 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 18,03,695కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 38,135కి పెరిగింది. 5,79,357 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 11,86,203 మంది కోలుకున్నారు.
 
కాగా, నిన్నటి వరకు మొత్తం 2,02,02,858 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)  తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,81,027 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments