Webdunia - Bharat's app for daily news and videos

Install App

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ45

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:44 IST)
భారతదేశం అంతరిక్ష పరిశోధనల్లో మరో విజయవంతమైన ప్రయోగాన్ని నమోదు చేసుకుంది. శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రమైన ఇస్రోలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ45 నింగిలోకి దూసుకెళ్లింది. ఇది ఇమిశాట్ సహా 28 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్తోంది. పీఎస్‌ఎల్‌వీ సీ45 ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో సైంటిస్టులు వెల్లడించారు. 
 
విదేశీ రాడార్లను పసిగట్టి సమాచారాన్ని అందించే నిఘా ఉపగ్రహాన్ని రాకెట్ రోదసీలోకి తీసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని డీఆర్‌డీవో రూపొందించింది. 436 కిలోల బరువు ఉన్న ఈ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇఎంఐఎస్‌ఏటీ(ఇమిశాట్)ను పీఎస్‌ఎల్‌వీ సీ45 కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనితో పాటు అమెరికాకు చెందిన 24 ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన 2, స్విట్జర్లాండ్, స్పెయిన్‌కు చెందిన ఒక్కో శాటిలైట్‌ను రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9.27 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments