Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుదుట బొట్టు బిళ్లల ప్యాకెట్‌నూ వదలని చౌకీదార్ మోడీ...

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:39 IST)
"నేను మీ చౌకీదారుని" అనే నినాదంతో ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం కోసం ప్రతి వస్తువును వాడేస్తున్నారు. ఇటీవల రైళ్ళలో టీ కప్పులపై కూడా మైబీ చౌకీదార్ అనే నినాదంతో బీజేపీ ప్రచారానికి తెరలేపింది. ఇంకొందరు బీజేపీ అభిమానులు పెళ్లి శుభలేఖలను కూడా బీజేపీ ప్రచారాస్త్రంగా ఉపయోగించారు. 
 
మాపెళ్లికి మీరు గిఫ్టులు ఇవ్వొద్దు కానీ మోడీకి ఓటేయ్యండని కోరిన సంఘటనను కూడా మనం చూసాం. మరోవైపు చీరలపై మోడీ బొమ్మలను కూడా ముద్రిస్తూ వాటిని విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మహిళా ఓటర్లను ఆకర్షించడానికి నుదుట పెట్టుకునే బొట్టు బిళ్లల ప్యాకెట్‌పై ఏకంగా మోడీ బొమ్మను ముద్రించారు.
 
 
పరాస్ ఫ్యాన్సీ బిందీ అనే కంపెనీ విడుదల చేసిన బొట్ట బిళ్లల ప్యాకెట్‌పై ఒకవైపు నరేంద్రమోడీ, మరోవైపు బీజేపీ కమలం గుర్తు ముద్రించి ఉన్నాయి. పైభాగంలో హిందీలో ఫిర్ సే మోదీ సర్కార్ (మరోసారి మోడీ ప్రభుత్వం) అని రాసి ఉంది. ఈ ఫోటోలను పశ్చమ బెంగాల్  రాయ్‌గంజ్ నియోజకవర్గ ఎంపీ అయిన సలీం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 
 
పేటీఎం బ్రాండ్ అంబాసిడర్ ఇప్పుడు పరాస్ ఫ్యాన్సీ బిందీలకు ముఖచిత్రంగా మారిపోయారని ఎండీ సలీమ్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు నిజంగా కంపెనీ ముద్రించిందా లేక ఇంకెవరైనా అనధికార వ్యక్తులెవరైనా ముద్రించారా అన్నది తేలాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments