Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్‌తో ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగింపు

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:26 IST)
పాన్ కార్డ్ నంబర్‌తో ఆధార్ నంబర్‌ను లింక్ చేయమని ప్రభుత్వం కోరుతోంది. వీటిని లింక్ చేసుకునేందుకు మార్చి 31వ తేదీని గడువు తేదీగా నిర్ణయించింది. అయితే గడువుతేదీ పూర్తయినప్పటికీ చాలా మంది అనుసంధానం చేసుకోలేదు. ఈ అనుసంధాన ప్రక్రియకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం గడువును పొడిగించింది.
 
వీటి అనుసంధానానికి గడువు ఇంతకుముందు ప్రకటించిన ప్రకారం మార్చి 31తో ముగియగా, తాజాగా మరో ఆరు నెలలపాటు ఆ గడువును పొడిగించింది. సెప్టెంబర్ 30లోపు వినియోగదారులు పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. 
 
ఇకపై ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేసేవారు తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌ను కూడా  పొందుపరచాలని సూచించింది. ఈ నిబంధన ఏప్రిల్ 1 ,2019 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఆధార్ రాజ్యాంగ బద్దమేనని, ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేవారు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌ను పొందుపరచాలని గతేడాది సెప్టెంబర్‌‌లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments