Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గగన్‌యాన్ మిషన్' కోసం తొలి పరీక్షకు ఇస్రో సిద్ధం

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2023 (12:28 IST)
గగన్‌యాన్ మిషన్‌కు సంబంధిచిన తొలి పరీక్ష చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సిద్ధమైంది. శ్రీహరికోటలోని స్పేస్ సెంటరులో అక్టోబరు 21వ తేదీన ఉదయం 8 గంటలకు టెస్ట్ వెహికిల్ డెవలప్మెంట్ పరీక్ష నిర్వహించనుంది. ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించదలిచిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి వస్తుంది. 
 
వ్యోమగాముల అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో గగన్‌యాన్ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వ్యోమగాములు ప్రయాణించే క్రూమాడ్యుల్, రాకెట్‌పై తొలి పరీక్షను ఇస్రో చేపట్టనుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో టీవీ-డీ1 అనే ప్రయోగాత్మక రాకెట్‌ను సిద్ధం చేసింది. దీని సాయంతో క్రూ మాడ్యుల్‌ను అంతరిక్షంలోకి పంపిస్తుంది. 
 
రాకెట్ కొంత ఎత్తుకు చేరుకున్నాక ఎస్కేప్ సిస్టమ్ క్రియాశీలకమై క్రూ మాడ్యుల్‌ను రాకెట్ నుంచి వేరు చేస్తుంది. ఈ క్రమంలో క్రూ మాడ్యుల్ తిరిగి బంగాళాఖాతంలో పడుతుంది. నావికాదళం సాయంతో ఇస్రో క్రూ మాడ్యుల్‌ను స్వాధీనంలోకి తీసుకుని అందులోని డేటా ఆధారంగా రాకెట్, ఎస్కేప్ సిస్టమ్, క్రూ మాడ్యుల్ పనితీరును విశ్లేషిస్తుంది. అత్యవసర సందర్భాల్లో వినియోగించే ఎస్కేప్ సిస్టమ్ పనితీరును ఇస్రో ఈ ప్రయోగం ద్వారా పరీక్షిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments