Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇస్రో మరో ఘనత.. చంద్రమృత్తికను కృత్రిమంగా తయారు చేసిందోచ్

Webdunia
గురువారం, 21 మే 2020 (12:06 IST)
ఇస్రో మరో ఘనత సాధించింది. చంద్రుడిపై వుండే మాదిరి మట్టిని తయారుచేసి అబ్బురపరిచింది. ఈ ఆవిష్కరణకు గాను పేటెంట్ హక్కులను సొంతం చేసుకుంది. చంద్రమృత్తికను కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నందుకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఇస్రోకు పెటెంట్‌ను మంజూరు చేసింది. ఈ పేటెంట్ హక్కులు ఇస్రో దరఖాస్తు చేసిన నాటి నుంచి మరో ఇరవై సంవత్సరాల పాటు ఉంటుంది. 
 
ఈ మట్టి ఎందుకంటే.. భారత్ గతంలో తలపెట్టిన చంద్రయాన్‌లో విక్రమ్ మూన్ లాండర్.. చంద్రుడిపై దిగే సమయంలో విఫలమైంది. అయినా చంద్రుడిపై కాలు మోపేందుకు భారత్ మరో ప్రయత్నం చేస్తోంది. అదే చంద్రయాన్-2. ఈ ప్రయోగాల్లో భాగంగా విక్రమ్ లాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మొదలైన వాటిని పరీక్షించేందుకు ఇస్రోకు చంద్రుని మీది ఉంటే వాతావరణాన్ని కృత్రిమంగా తయారు చేయాల్సి వచ్చింది.
 
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో కూడా తలపెట్టనున్న అనేక అంతరిక్ష ప్రయోగాలకు ఇది చాలా అవసరమౌతుంది. అయితే మొదట ఈ చంద్రమృత్తికను అమెరికా నుంచి దిగుమతి చేసుకుందామనుకున్నారు. అయితే అది చాలా ఖరీదైన వ్యవహారంతో కూడుకున్నది కావడంతో.. దేశీయంగా చంద్రుని మీద వుండే మట్టిని తయారు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments