Webdunia - Bharat's app for daily news and videos

Install App

షార్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ-49 వాహక నౌక కౌంట్‌డౌన్‌ ప్రారంభం

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (10:08 IST)
PSLV_49
షార్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ-49 వాహక నౌక కౌంట్‌డౌన్‌ కొనసాగుతోంది. శ్రీహరికోటలో శుక్రవారం మధ్యాహ్నం 1.02గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. శనివారం మధ్యాహ్నం 3.02గంటలకు సీ-49 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. 51వ మిషన్‌లో భాగంగా పీఎస్‌ఎల్‌వీ భారత్‌కు చెందిన ఈఓఎస్‌-01 సహా విదేశాలకు చెందిన తొమ్మిది విదేశి ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనుంది. 
 
దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ద్వారా వాతావరణ, వ్యవసాయ, అటవీ సంబంధ స మాచారం తెలుసుకోవచ్చు. కొవిడ్ -19 మహమ్మారి మధ్య ఇస్రో ఈ ఏడాది చేపడుతున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే. కరోనాతో మార్చి నుంచి అన్ని అంతరిక్ష కార్యకలాపాలు మందగించిన విషయం తెలిసిందే. 
 
ఈ మిషన్‌ పూర్తయిన వెంటనే డిసెంబర్ నాటికి కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ) పరీక్షించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. అలాగే జీశాట్‌-12 ఆర్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలో పెట్టేందుకు పీఎస్‌ఎల్‌వీ-సీ 50 మిషన్‌ను చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments