Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో అలా వెళ్ళిన యువకుడు ఇలా వచ్చేశాడు..?

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (18:07 IST)
కాశ్మీర్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు యువకులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. చాలామంది విద్యావంతులను ఉగ్రవాదంలోకి లాగేస్తున్నాయి. దీంతో చాలామంది యువకులు ఉగ్రవాదులుగా మారిపోతున్నారు. అలా మారిపోయిన యువకులు ఇంటి వైపు తిరిగి చూడట్లేదు. తల్లిదండ్రులను, బంధువులను వదిలిపెట్టి.. వెళ్లిపోతున్నారు. 
 
కానీ జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మాత్రం విభిన్నమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీనగర్, ఖనియార్‌కు చెందిన ఎహతేషాం బిలాల్ సోఫీ (20) నిషేధిత ఉగ్రవాద సంస్థలో చేరాడు. నోయిడాలో ఇంజనీరింగ్ చదువుకున్న కుమారుడు కనపించకపోయేసరికి.. అతని కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. చివరికి బిలాల్ ఉగ్రవాదిగా మారిపోయాడని తెలుసుకుని అతని తల్లిదండ్రులు షాకయ్యారు. 
 
అంతేగాకుండా.. తమ వంశంలో బిలాల్ ఒక్కడే కుమారుడని.. అతడిని విడిచిపెట్టాలని అతని తల్లిదండ్రులు ఉగ్రవాద సంస్థకు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రుల విజ్ఞప్తికి తోడు పోలీసులు కూడా బిలాల్‌ గురించి గాలింపు చర్యలు చేపట్టడంతో బిలాల్ ఆదివారం రాత్రి ఇల్లు చేరాడు. బిలాల్ రాకతో.. అతని తల్లిదండ్రుల సంతోషానికి అవధుల్లేవు. అతని వద్ద విచారణ జరిపామని.. అతనిని అరెస్ట్ చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments