Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్ - పాట్నా రైలు ప్రమాదం : 133కు పెరిగిన మృతుల సంఖ్య

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌కు సమీపంలోని పుఖ్రయా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 133కు చేరింది.

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (10:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌కు సమీపంలోని పుఖ్రయా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 133కు చేరింది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిలో సగం మంది పరిస్థితి విషమంగా ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
మరోవైు.. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌ నిర్వహణ లోపం ఫలితంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. యూపీ పోలీసులు, రైల్వే సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 
 
ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం, రెండు బోగీలు ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకుపోవటంతో చాలావరకు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారాయి. కాగా, ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో నేడు రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు ప్రకటన చేయనున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ గారికి నటించడమేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments